దోమ ధాటికి ఆ దేశం ఎమర్జెన్సీ విధించుకుంది

December 24, 2015 | 11:30 AM | 2 Views
ప్రింట్ కామెంట్
zika-mosquito-brazil-emergency-niharonline

బ్రెజిల్ ప్రస్తుతం వింత పరిస్థితి నెలకొంది.  గర్భం దాల్చాలన్న కోరికను మహిళలు కొంతకాలంపాటు ఆపుకోవాలని అక్కడి వైద్యులు కోరుతున్నారు. వైద్యులు సైతం అంతలా వణికిపోవటానికి కారణం ఓ చిన్ని దోమ. అవునండీ. ఆ దేశంలో ఈ మధ్య సుమారు 2,400 మంది మెదడులో లోపాలతో జన్మించారు. దీనికి 'జికా' అనే దోమ కారణమని వైద్యులు చెబుతున్నారు. గర్భంతో ఉన్న స్త్రీని గనక ఈ దోమ కుడితే, 'మైక్రోసెఫాలీ' వ్యాధి సోకి ఆ ప్రభావంతో చిన్నారుల పుర్రెలు కుంచించుకుపోతాయి. ఆపై పరిస్థితి విషమించి మరణం సంభవిస్తుంది. ఇదొక అనుకోని పరిస్థితి, ప్రపంచ సైంటిఫిక్ రీసెర్చ్ విభాగానికి ఓ అంతుచిక్కని సవాలు అని బ్రెజిల్ వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక జికా దెబ్బకి ప్రస్తుతం ఆ దేశ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది.

                 తాజా నివేదిక ప్రకారం 'మైక్రోసెఫాలీ' కారణంగా 29 మంది చనిపోయారని, 2014లో 147 కేసులు నమోదు కాగా, 2015లో 2,400కు పైగా కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గర్భిణీలుగా ఉండేవారు, ఈ దోమ కాటుకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, ఈ వైరస్ ను తొలిసారిగా 70 ఏళ్ల క్రితం ఆఫ్రికాలోని అడవుల్లో నివసించే కోతుల్లో కనుగొన్నారు. కానీ, మానవ శరీరంలో కనుగొనడం మాత్రం ఇదే ప్రథమం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ