చిత్తుగా కాదు చెత్తగా ఓడారు

January 20, 2015 | 03:07 PM | 31 Views
ప్రింట్ కామెంట్

ముక్కోణపు సిరీస్ లో టీం ఇండియా చెత్త ప్రదర్శనతో మరో ఓటమిని మూటకట్టుకుంది. రెండో మ్యాచ్లో ఇంగ్లాండ్ పై 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. బ్యాటింగ్ లోనే కాదు... బౌలింగ్ లో కూడా చేతులేత్తేశారు. తప్పుడు షాట్ లతో బ్యాట్స్ మెన్ వికెట్లు పారేసుకోగా, స్వల్ఫ అధిక్యాన్ని కాపాడుకోలేక బౌలర్లు చతికిలపడ్డారు. దారుణం ఏంటంటే కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోవటం. కేవలం 39.3 ఓవర్లలోనే 153 పరుగులకు అలౌట్ అయ్యింది. ఇందులో బిన్నీ (44) దే అత్యధిక స్కోర్. దీనిని ఇంగ్లాడ్ ఒక వికెట్ కోల్పోయి కేవలం 27 ఓవర్లలోనే సాధించగలిగింది. పేస్ భౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై మొదట బ్యాటింగ్ కు దిగి ధోనీ సేన పెద్ద తప్పుచేసింది. తొలిమ్యాచ్ ను చివరిదాకా లాకొచ్చి ఓడిపోయినప్పటికీ, రెండో మ్యాచ్ ఇలా దారుణంగా ఓటమిపాలవటంతో మనోళ్ల ఫెర్ఫార్మెన్స్ పై క్రమంగా నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ