నయా వంచన: 100 మందికి మత్తుమందిచ్చి బ్లూఫిల్మ్ లు తీశాడు

February 04, 2015 | 01:39 PM | 61 Views
ప్రింట్ కామెంట్

జపాన్ లో వెలుగుచూసిన ఓ దారుణమైన విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది. క్లినికల్ స్టడీ సెంటర్ పేరిట ఓ నీచుడు 100 మంది యువతులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆ వీడియోలను చిత్రీకరించి నీలిచిత్రాలు చేసి సైట్లకు అమ్ముకుని డబ్బు సంపాదించాడు. వివరాల్లోకి వెళ్లితే... 2011 సంవత్సరంలో ఒక స్టడీ సెంటర్ లో వైద్య విద్యలో భాగంగా వందమంది యువతులు చేరారు. వారంతా నిద్రిస్తున్న సమయంలో డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారం చేయటం మొదలుపెట్టాడు. అంతేకాదు వాటన్నింటిని నీలిచిత్రాలుగా చేసి నిర్మాతలకు అమ్మి కోట్లు గడించాడట. ఆ యువతులంతా 2013 నవంబర్ వరకు ఆ సెంటర్ లోనే వాలంటరీలుగా విధులు నిర్వర్తించారు. జరిగిన ఘోరం ఒకటి వీడియో రూపంలో బయటపడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ నీచుడు ఆ ఘోరాలన్నింటినీ నీలిచిత్రాలుగా చేసి అమ్మినట్లు విచారణలో తేలిందట. అంతేకాదు అది భోగస్ స్టడీ సెంటర్ అని పోలీసులు తేల్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ