ఓడారని తక్కవ అంచనా వేశారో... అంతే!

January 13, 2015 | 02:18 PM | 31 Views
ప్రింట్ కామెంట్

ప్రపంచకప్ లో టీంఇండియాను తక్కువగా అంచనా వేయొద్దని ఆసీస్ మాజీ క్రికెటర్ మైక్ హస్సీ ఆస్ట్రేలియా క్రికెట్ టీంకు సూచించాడు. సిడ్నీలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... టెస్టుల్లో ఓటమిపాలైందని టీమీండియాను తక్కువ అంచనా వేయవద్దని అన్నాడు. టీమిండియా పుంజుకునే అవకాశం ఉందని హస్సీ అభిప్రాయపడ్డాడు. రెండు నెలలపాటు ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమీండియాకి పిచ్ లపై ఓ అవగాహన ఏర్పడి ఉంటుంది. దానివల్ల పిచ్ కు అనుగుణంగా వ్యూహాలు రచించి విరుచుకుపడే అవకాశం ఉందని హస్సీ తెలిపాడు. టీమీండియా డిఫెండింగ్ ఛాంపియన్ అన్న విషయం మరవోద్దని కంగారులకు హెచ్చరిక జారీచేశాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ