కరెంట్ పోల్ కే షాకిచ్చిన మృగరాజు

October 01, 2015 | 02:50 PM | 2 Views
ప్రింట్ కామెంట్
mountain-lion-on-35-feet-pole-niharonline.jpg

చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా అంటే... దానికేం ఎనిథింగ్ పాజిబుల్ అంటూ హీరోయిన్ కు రిప్లై ఇస్తాడు చెంచులక్ష్మి సినిమాలో ఎఎన్నార్. ఇక ఇప్పుడు ఇక్కడ ఓ మృగరాజు కరెంట్ పోల్ ఎక్కి చూపరులకు కనువిందు చేసింది. కేవలం పర్వత సాణువుల్లో మాత్రమే కనిపించే ఆ సింహం. దారితప్పి జనావాసాల్లోకి వచ్చింది. సడన్ గా అటువైపు ఓ స్కూల్ బస్సు రావటంతో జడుసుకుంది. వెంటనే పక్కనే ఉన్న 35 అడుగుల ఎత్తున్న కరెంటు స్తంభాన్ని ఎక్కింది. నిట్టనిలువుగా ఉన్న స్తంభంపై సింహం స్వైర విహారం చేస్తూంటే చూపరుల ఆశ్చర్య పోరా మరీ. వెంటనే ఓ న్యూస్ పేపర్ ఏజన్సీ స్టాఫ్ చూసి తన కెమెరాలో బంధించాడు. ఇప్పుడు ఆ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన కాలిఫోర్నియాలోని మారూమూల ప్రాంతం లుకర్నీ లోయలో జరిగింది. ఇక స్తంభం ఎక్కిన ఆ మృగరాజు గారు చాలా సేపటి వరకూ కిందకు దిగలేదట. బహుశా కొండలెక్కిన అనుభవం ఈ సింహం గారికి ఇలా పనికొచ్చిందేమో!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ