అబ్బో... వారూ కనికరం చూపారే!

December 31, 2014 | 12:58 PM | 41 Views
ప్రింట్ కామెంట్

సరిహద్దులో ఎప్పుడూ కవ్వింపు చర్యలతో అలజడి సృష్టించే పాక్ భద్రతా దళాలు కాస్త కనికరం ప్రదర్శించాయి. తల్లి తిట్టిందని నియంత్రణ రేఖ దాటి తమ భూభాగంలో అడుగుపెట్టిన ఓ కశ్మరీ బాలికను క్షేమంగా ఆమె కుటుంబానికి అప్పగించాయి. యూరి పట్టణానికి సమీపంలోని సౌరా గ్రామంలో నివసించే నస్రీనా బానో అనే 12 ఏళ్ల బాలిక గత శుక్రవారం పాక్ లో ప్రవేశించింది. తల్లి తిట్టిందన్న కారణంగా బాలిక ఇల్లు విడిచింది. బాలికను గుర్తించిన పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వివరాలు తెలుసుకున్న అనంతరం భారత సైనాధ్యాధికారులతో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి బాలికను కుటుంబానికి అప్పగించాలని నిర్ణయించారు. కమాన్ పోస్టు వద్ద సోమవారం నస్రీనా బానోను భద్రంగా తల్లిదండ్రులకు అప్పగించారు. దీనిపై బాలిక బంధువు ఒకరు మాట్లాడుతూ... ఇటీవల సంభవించిన వరదల కారణంగా సరిహద్దు ప్రాంతంలోని కంచె దెబ్బతిన్నదని, అందువల్లే ఎందరో పొరబాటున పాక్ భూభాగంలోకి ప్రవేశిస్తున్నారని తెలిపాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ