కరెంట్ తీగ 25 మంది పెళ్లివారిని బలితీసుకుంది

June 12, 2015 | 05:29 PM | 0 Views
ప్రింట్ కామెంట్
bus_touches_electric_wires_tonk_rajasthan_niharonline

రాజస్థాన్ లోని  ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టోంక్ వద్ద రహదారిపై వెళ్తున్న పెళ్లి బృందం బస్సుపై విద్యుత్ తీగలు తెగిపడటంతో 25 మంది చనిపోయారు. ఘటనా స్థలిలోనే 18 మంది చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 7 మరణించారు. మరో 15 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలి వద్ద బంధువుల రోదనతో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపిస్తూ గ్రామస్థులు రాస్తారోకో చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో పోలీసులకు, గ్రామస్థులకు పెద్ద వాగ్వాదం జరిగింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ