గాల్లో ఉండగా విమానం అద్దం పగిలితే...

December 21, 2015 | 12:16 PM | 1 Views
ప్రింట్ కామెంట్
air-india-flight-crackdown-emergency-land-niharonline

నిర్లక్ష్యంతో ఘోర విమాన ప్రమాదాలు జరగటం, వందల సంఖ్యలో ప్రాణాలు బలికావటం నిత్యం మనం వార్తల్లో చూస్తున్నాం. ఎయిర్ ఇండియా సిబ్బంది పనితనంతో భారత గగనతలంలో కూడా అలాంటి ప్రమాదం జరిగేదే. నిండా ప్రయాణికులతో గాల్లోకి ఎగిరిన ఓ ఎయిర్ ఇండియా విమానం ముందు అద్దం గాల్లోనే పగిలిపోయింది. అయితే పైలెట్ చాకచక్యంతో వ్యవహరించటంతో ఘోర ప్రమాదం తప్పింది. వివరాల్లోకెళితే... ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టు నుంచి 160 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోకు బయలుదేరింది.

                                టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపట్లోనే కాక్ పిట్ ముందున్న అద్దం పగిలిపోయింది. దీనిని గమనించిన పైలట్ ఏటీసీకి సమాచారాన్ని చేరవేశాడు. ఏటీసీ ఆదేశాలతో పైలట్ విమానాన్ని తిరిగి ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులోనే కిందకు దించేశాడు. అయితే ప్రమాదాన్ని వెనువెంటనే గమనించిన పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. విమానం కిందకు దిగేదాకా అద్దం పగిలిపోయిన విషయం ప్రయాణికులకు తెలియలేదు. అయితే పెను ప్రమాదం నుంచి తప్పించి, విమానాన్ని సురక్షితంగా కిందకు దించిన పైలట్ ను ప్రయాణికులు అభినందించారు. విచారణలో టేకాఫ్ కు ముందే అద్దంకు పగులు ఉందని తేల్చిన అధికారులు సిబ్బందిపై వేటు వేశారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ