అలాగైతే కాన్షీరాంకూ భారతరత్న ఇవ్వాలట

January 03, 2015 | 03:44 PM | 62 Views
ప్రింట్ కామెంట్

భారతరత్నను తమ వారికి ఇవ్వాలంటూ పలు డిమాండ్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి చేరుతున్నాయి. తాజాగా, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాంకు భారతరత్న ప్రకటించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ముఖ్యంగా దళితుల అభ్యున్నతి కోసం కాన్షీరాం ఎంతగానో పాటుపడ్డారని... భారతరత్నకు ఆయన అన్ని విధాల అర్హులని ఆమె తెలిపారు. ఇదే సమయంలో ఆమె ఎన్డీయే పై నిప్పులు చెరిగారు.ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మత ఘర్షణలను రెచ్చగొడుతూ కాలం గడుపుతోందని... ఒక్క అభివ్రుద్ధి పని కూడా చేపట్టలేదని మండిపడ్డారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ