నేతల కొడుకులు చస్తే ఇలానే చేస్తారా?

December 06, 2014 | 05:32 PM | 117 Views
ప్రింట్ కామెంట్

మావోయిస్టులు జరిపిన దాడిలో మృతి చెందిన సీఆర్ఫీఎఫ్ కానిస్టేబుళ్ల దుస్తులు, బూట్లు చెత్త కుప్పలో కనిపించడం పెను దుమారాన్ని రేపింది. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నామని చెప్పి విచారణకు ఆదేశించినా పరిస్థితి సద్దుమణగలేదు. ఈ చర్యపై మృతవీరుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడి కొడుకు చనిపోతే ఇలాగే చేస్తారా? దేశం కోసం పోరాడి మరణించిన వాళ్ళ యూనిఫాంలకు కనీస గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని మావోల దాడిలో మృతి చెందిన కులదీప్ తండ్రి ధరంపాల్ పూనియా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఘటనపై కాంగ్రెస్ తోసహా విపక్షాలన్నీ బీజేపీపై మండిపడుతున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ