తమిళనాడులో రైలు ప్రమాదం... 39 మందికి గాయాలు

September 04, 2015 | 10:40 AM | 8 Views
ప్రింట్ కామెంట్
Chennai Mangalore Express Derail in Tamil Nadu.jpg

తమిళనాడులో శుక్రవారం ఓ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి మంగళూరు వెళ్తున్న ఎగ్మూర్ మంగళూర్ ఎక్స్ ప్రెస్ అర్ధరాత్రి 2 గంటల సమయంలో కడ్డాలోర్ జిల్లా వద్ద పట్టాలు తప్పింది. అదుపు తప్పిన మొదటి అదుపు భోగీలు బోల్తాపడటంతో 39 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా కేంద్రానికి 200 కిలోమీటర్ల దూరంలోని పువనూర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. సాధారణ గాయాలే అయ్యాయని ఎవరూ తీవ్రంగా కూడా గాయపడలేదని వారు చెబుతున్నారు. కాగా ఈ ప్రమాదంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.    

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ