టెర్రరిస్ట్ లకూ సిద్ధివినాయక తాయెత్తులే అండ!

February 12, 2016 | 11:34 AM | 1 Views
ప్రింట్ కామెంట్
david-headley-siddivinayaka-temple-scare-threads-niharonline

ముంబై కోర్టు నుంచి అమెరికాలో ఉన్న డేవిడ్ హెడ్లీని వీడియో కాన్ఫరెన్స్ లో నాలుగో రోజు విచారణలో ఆసక్తికర విషయాలు చెబుతున్నాడు. గుజరాత్ ఎన్ కౌంటర్ లో మరణించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇష్రాత్ జహాన్, లష్కరే తోయిబా ఆత్మాహుతి దళ సభ్యురాలని గురువారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక శుక్రవారం విచారణలో భాగంగా ఉగ్రవాదులను హిందువులుగా చూపేందుకు వారు చేసిన పనుల గురించి వివరించారు.

            ఉగ్రవాదుల కోసం సిద్ధివినాయక దేవాలయం నుంచి తాయెత్తులు, చేతులకు కట్టుకునే దారాలను కొనుగోలు చేసినట్టు చెప్పాడు. ఇవి చేతులకు ఉంటే, ఉగ్రవాదులన్న అనుమానం రాదన్నది తమ ఉద్దేశమని చెప్పాడు. పోలీసులు కళ్లు కప్పి తాము అలాగే మొత్తం పర్యటించామని చెప్పుకొచ్చాడు. 26/11 దాడులకు ముందు గేట్ వే ఆఫ్ ఇండియా, కుఫీ పరేడ్ ప్రాంతాలను సందర్శించి, చివరకు తమ దాడికి కుఫీ పరేడ్ అనుకూలమన్న నిర్ణయానికి వచ్చామని చెప్పాడు. 2008లో ఏప్రిల్ 9 నుంచి 15 వరకూ ముంబైలోని పలు ప్రాంతాల్లో రెక్కీలు నిర్వహించిన తాను, పాక్ కు వెళ్లి సాజిద్ మీర్, మేజర్ ఇక్బాల్ తదితరులను కలిసి దాడుల నిమిత్తం వెళ్లేవారిని ఎక్కడకు పంపాలన్న విషయాన్ని విడియో ద్వారా వివరించినట్టు హెడ్లీ సాక్ష్యమిచ్చాడు.

               తాను వినాయకుడి గుడి నుంచి 20 వరకూ బ్యాండ్లు కొన్నానని, వీటిని సాజిద్ మీర్ కు ఇస్తే, మంచి ఆలోచన చేశావని అభినందించాడని గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో లఖ్వీ తనతో మాట్లాడుతూ, ఇండియాలో ఏ ప్రాంతంపై దాడి చేసినా, అది తమకు ఆనందమేనని, పాక్ ప్రతీకారంలో భాగమేనని అన్నట్టు హెడ్లీ వివరించాడు. జ్యూయిష్ లు, ఇజ్రాయిలీలు అధికంగా ఉండే చాబాద్ హౌస్ ను మాత్రం లష్కరే తోయిబా ఎంచుకుందని తెలిపాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ