వాళ్లిద్దరిది ‘షోలే’ రే్ంజ్ అనుబంధమట

December 26, 2014 | 10:43 AM | 23 Views
ప్రింట్ కామెంట్

వాజ్ పేయికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడం పట్ల బీజేపీ కురువ్రుద్ధుడు అద్వానీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని వాజ్ పేయితో తనకున్న అనుబంధాన్ని ఈ అగ్రనేత ఓసారి గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనైయ్యారు.‘మా ఇద్దరిది అపూర్వమైన స్నేహబంధం. వయస్సులో ఉన్నప్పుడు ఇద్దరం స్కూటర్ పై తిరిగే వాళ్లం. వాజ్ పేయిని నా స్కూటర్ వెనకాల కూర్చోబెట్టుకొని ఛాట్ తినేందుకు ఢిల్లీలోని కనాట్ ప్లేస్ కు వెళ్లేవాడిని. అటల్ జీకి ఛాట్ అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టం లేకపోయినా కేవలం వాజ్ పేయి కోసమే నేను వెళ్లేవాడిని’ అని ప్రసంగించారు. బీజేపీ జాతీయ పార్టీగా ఎదుగుదలలో వీరిద్దరు ఎంత కీలక పాత్ర పోషించారో అందరికీ తెలిసిందే. వాజ్ పేయి ప్రభుత్వంలో అద్వానీ ఉప ప్రధానిగా కూడా పనిచేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ