పాలూ, గంగా జలం తాగి... కాస్త నెమ్మదిగా పొడిచేయ్

August 08, 2015 | 04:40 PM | 1 Views
ప్రింట్ కామెంట్
adithya_nath_yogi_ISIS_ganga_jal_milk_niharonline

ఉస్మాన్ నవేద్ పాకిస్థాన్ నుంచి బోర్డర్ లో ఉన్న కంచె కత్తిరించి సహచరులతో కలసి మన దేశం చక్కావచ్చి చేయాల్సిన డామేజి పూర్తిగాకుండా దొరికిపోయాడు. ఈ కుర్ర ఉగ్రవాదిని మనవాళ్లు విచారిస్తుంటే వాడు మాట్లాడే తీరు దిమ్మతిరిగిపోతుంది. వాడికి లోకం పోకడ తెలియదు. మతం పేరుతో వాడిని నవ్వుకుంటూ రక్తం తాగేలా తయారుచేశారు. పాము అందంగా మెరుస్తుందని మెడలో వేసుకోం గదా. తప్పదు తోకలో ప్రాణం ఉన్నా కడవరకు నలిపి నాశనం చెయ్యాల్సిందే. ఎందుకొచ్చవురా సాయిబూ ఇక్కడికంటే అడిగిన వాళ్లని వెర్రి వెధవల్లా చూసి చంపడానికి, చంపడానికి తప్ప ఇంకేం పనిమాకు అన్నాడు మాదేశంతో శత్రుత్వం దేనికి, చిన్న పిల్ల లేం చేశార్రా మిమ్మల్ని అంటే ఇలాంటి శుభకార్యాలు చేసినపుడు భలే మజా వస్తదిలే అన్నాడు. పైసలు ఎంత తీస్కున్నావు దీనికి అంటే ఏ మాట్లాడుతున్నావో తెల్సా పైసాగియిసా జాన్తానై... చంపడం, చావడం అల్లా పేరుతో ఏదైనా చేస్తాం. సరే తర్వాతి ప్రోగ్రాం ఏమిటి మీది అని అడిగితే చాల వంకరగా చెప్పిన జవాబు ఏమిటో తెల్సా? అసలు నన్నెందుకు పట్టుకున్నారు? పట్టుకోకుండా ఉంటే మీకే తెలుసును అని.

ఇదంతా శాంపిల్ మాత్రమే. ఈ విధంగా కొంపలంటుకు పోతుంటే మన యోగి ఆదిత్యనాథ్ స్వామిజీ ఇటువంటి ఉత్పాతాలకి తరుణోపాయం బోధించేడు. గంగమ్మ తల్లిని, గోమాతను పూజించినంతకాలం మనల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరని, కనీసం గోమాత కొమ్ములతో కుమ్మించి, గంగానదిలో పాతర వెయ్యమని చెప్తే బావుండును. ఇంత కరుడుగట్టిన క్రూరమైన వ్యవహరం డీల్ చెయ్యడానికి గంగానది, గోమాత అని భజన చేస్తే ఏమైతది సామి?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ