పెళ్లి ఇష్టంలేని ఆ అమ్మాయి ఏం చేసిందంటే...

April 11, 2016 | 12:16 PM | 6 Views
ప్రింట్ కామెంట్
gujarat-minor-girl-abhayam-help-line-niharonline

కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చదువుకునే స్తోమత లేక మన దేశంలో ఎందరో యువత కూలీపనులు చేసుకుంటున్నారు. అయితే కుల కట్టుబాట్ల సాకుతో చదివించే స్తోమత ఉన్నప్పటికీ ఆ కుటుంబ సభ్యులు యువతికి బలవంతగా పెళ్లి చేయాలని యత్నించారు. పైగా బాల్యవివాహం. అయితే చదువే ప్రాణంగా భావించిన ఆ యువతి తెగించింది. ఆ తర్వాత ఏం చేసిందో మీరే చదవండి.   

                గుజరాత్, గాంధీనగర్ కు 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొలవడ అనే గ్రామం ఉంది. ఆ ఊరి నుంచి శనివారం 17 ఏళ్ల అమ్మాయి 181 అభయం హెల్ప్ లైన్ కు ఫోన్ చేసింది. ఇంట్లో వాళ్లు తనకు పెళ్లి నిశ్చయించారని, ఈ నెల 18న పెళ్లిముహూర్తం ఖరారు చేశారని, తనకు చదువుకోవాలని ఉందని, పెళ్లి ఇష్టం లేదని, పెళ్లిని ఆపించి తనకు సాయం చేయాల్సిందిగా ఆ అమ్మాయి వేడుకోంది.

అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. తనకు ఇష్టంలేదని ఆమె ఎంత చెప్పినా ఎవరూ ఆమె మాట వినే పరిస్థితి లేదు. దీంతో ఆమె ఫిర్యాదు చేసింది. తన కుటుంబ సభ్యులతో కలసి ఉండేందుకు ఇష్టంలేదని చెప్పింది. 181అధికారులు, మహిళా పోలీసులతో కలసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్లారు. వీరు రాగానే కుటుంబ సభ్యులు మాటమార్చేశారు. ఎలాంటి పెళ్లి ఏర్పాట్లు చేయలేదని చెప్పారు. అధికారులు పెళ్లి ఆహ్వాన పత్రికలను గుర్తించారు. ఆ అమ్మాయి తన ఆవేదనను అధికారులకు చెప్పింది. తనకు పదో తరగతిలో 88.11 శాతం మార్కులు వచ్చాయని. కాలేజీకి వెళ్లి చదువుకోవాలని ఉందని చెప్పింది. అయితే ఇంట్లో వాళ్లు చదువు మాన్పించినప్పటికీ, వారికి తెలీకుండా సొంతంగా చదువుకుంటూ ఇంటర్ పరీక్షలకు సిద్ధమయ్యిందట.

విషయం పూర్తిగా విన్న అధికారాలు బాల్యవివాహం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులను హెచ్చరించారు. మహిళ సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని అమ్మాయికి సూచించగా, తన మేనమామ ఇంట్లో ఉండి చదువుకుంటానని చెప్పింది. చివరకు అమ్మాయి కుటుంబ సభ్యులు దిగివచ్చారు. ఆమె ఇష్టప్రకారం చదువుకునేందుకు అంగీకరించి లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. దీంతో చదువుకోవాలన్న ఆ అమ్మాయి కలకు అడ్డంకులు తొలిగాయి. అభయం పేరిటి ప్రభుత్వం నెలకొల్పిన ఈ హెల్ప్ సెంటర్ నెల వ్యవధిలో దాదాపు 20కి పైగా ఇలాంటి కేసులను పరిష్కరించిందని అధికారి ఒకరు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ