‘టైమ్స్’ రేసులో మోదీ

November 21, 2014 | 05:51 PM | 27 Views
ప్రింట్ కామెంట్

ప్రముఖ మ్యాగజైన్ టైమ్స్ ప్రతి ఏడాది ప్రకటించే ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ ఈ ఏడాది రేసులో భారత ప్రధాని మోదీ కూడా చేరారు. 2014-‘పర్సన్ ఆఫ్ ద ఇయర్' జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును మ్యాగ్జైన్ చేర్చింది. ప్రతి ఏడాది ప్రపంచ నేతలు, వ్యాపార దిగ్గజాలు, ఇతరత్రా ప్రముఖులతో 50 మందిని ఎంపిక చేసి ఒకరిని పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా టైమ్ ప్రకటిస్తుంది. ఒకప్పుడు 'వివాదాస్పద ప్రాంతీయ నేత'గా మోదీ ఉన్నారనీ ఈ సందర్భంగా మోదీ గురించి ప్రస్తావించింది. ఆర్థికాభివృద్ధి నినాదంతో తమ పార్టీ బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని సాధించిపెట్టి ప్రధాని పదవిని చేపట్టారని కొనియాడింది. కాగా, ఇప్పటివరకు ఈ రేసులో మోదీకి 3.8% ఓట్లు వచ్చాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ బాలిక, నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన మలాలా, ఎబోలా వ్యాధి కోసం పనిచేస్తున్న వైద్యులు-నర్సులు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఆ వ్యక్తి ఎవరో వచ్చే నెలలో పత్రిక వెల్లడించనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ