పెద్దాయన అలా మాట్లాడుతున్నాడేంటి?

November 21, 2014 | 04:51 PM | 41 Views
ప్రింట్ కామెంట్

ఉత్తరప్రదేశ్ మైనార్టీ వ్యవహారాల శాఖా మంత్రి మహ్మద్ ఆజంఖాన్ వరుసబెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు. తాజ్ మహల్ ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించి, బోర్డుకు అప్పగించాలని గురువారం ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఆయన మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. అయితే ఈసారి ఏకంగా పార్టీ చీఫ్ ములాయం నే టార్గెట్ చేశాడు. ములాయం సింగ్ 76వ పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరపాలని ఎస్పీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఈ వేడుకలకు కావాల్సిన సొమ్మంతా తాలిబన్ ఉగ్రవాద సంస్థ నుంచి, దావూద్ లాంటి మాఫియా డాన్ నుంచి ఫండ్ రూపంలో వచ్చిందని అజంఖాన్ వ్యాఖ్యానించారు. పెద్దాయన మీరు మాట్లాడింది మీ పార్టీ చీఫ్ గురించే... తెలుస్తోందా?.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ