అక్రమ సంబంధంతో కూతురిని హత్య చేసింది

March 14, 2016 | 03:21 PM | 4 Views
ప్రింట్ కామెంట్
meerut-mother-killed-daughter-niharonline

తెల్లవారితే ఆ ఇంట పెళ్లి తంతు. అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. కూతురికి ఓ మంచి వ్యాపారవేత్తతో వివాహం జరగనుందన్న ఆనందంలో ఉందా  తల్లి, కానీ, ఏం జరిగిందో తెలీదు. కన్న కూతురిని శవమై పడి ఉంది. అంతా ఆత్మహత్య అనుకున్నారు. అయితే విచారణలో షాక్ కి గురిచేసే విషయాలు వెల్లడయ్యాయి.  

                      భర్త మరణానంతరం మీరట్ కు చెందిన ఓ మహిళ కొడుకు, కూతురితో కలసి ఢిల్లీలో ఉంటోంది. తన కుమార్తెకు ఘజియాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహాన్ని కుదుర్చుకుంది. అయితే పెళ్లి ముందు రోజున ఆమె బయటకు వెళ్లి వచ్చేసరికి, ఇంట్లో అద్దెకున్న వ్యక్తితో కుమార్తె బెడ్ మీద శృంగారం చేస్తూ కనిపించింది. ఆమెను చూసి ఆ వ్యక్తి పారిపోగా, ఆగ్రహంతో  ఆ తల్లి కుమార్తె ముఖంపై దిండును అదిమి హత్య చేసింది. ఆపై కొడుకును పిలిచి విషయం చెప్పింది. అతడు తల్లికి మద్దతుగా నిలిచాడు.

గుండెపోటు వచ్చినందున ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని బంధువులకు చెప్పి మృతదేహాన్ని లోక్ నాయక్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆత్మహత్యాయత్నం చేసినట్టు అక్కడి వైద్యులకు తెలిపారు. అనుమానం వచ్చిన డాక్టర్లు, పోలీసులకు సమాచారం ఇస్తే, మొత్తం విషయం బయటకు వచ్చింది. మృతురాలికి, అదే ఇంట్లోని ఓ పోర్షన్ లో అద్దెకుండే వ్యక్తికి చాలా రోజులుగా అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీస్ విచారణలో తేలింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ