చెక్ బౌన్స్ కేసులకు లైన్ క్లియరైంది

December 09, 2015 | 11:11 AM | 1 Views
ప్రింట్ కామెంట్
New_law_makes_easier_file_cheque_bounce_cases_niharonline

చెక్ బౌన్స్ కేసులలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు రాజ్యసభలో కూడా మద్ధతు లభించింది. ఇకపై చెక్కును జమ చేసిన బ్యాంకు ఉన్న ప్రాంతంలోనే చెక్ బౌన్స్ కేసు పెట్టే వెసులుబాటును కేంద్రం ఈ చట్టం ద్వారా కల్పించింది. . ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా రాజ్య సభలో ప్రవేశపెట్టిన చట్ట సవరణ బిల్లుకు మోజార్టీతో ఆమోదం లభించింది. తద్వారా నెగోషియెబుల్ యాక్ట్ 1881 కి సవరణ చేసింది.

ఎవరో ఇచ్చిన చెక్కు తీసుకుని, అది బౌన్స్ కాగా, కేసు పెట్టేందుకు చెక్కు జారీ చేసిన బ్యాంకు లేదా చెక్కిచ్చిన వ్యక్తి ఉన్న ప్రాంతంలోని కోర్టులను ఆశ్రయించాల్సిన అగత్యం తప్పింది. కాగా, ప్రస్తుతం చేసిన ఈ సవరణతో దేశంలోని వివిధ కోర్టుల్లో 18 లక్షలకు పైగా చెక్ బౌన్స్ కేసులలో పిటిషన్ దారులకు ఊరట కలగనుంది. ఇదే బిల్లుకు గతంలో లోక్ సభ ఆమోదం పలికినప్పటికీ, రాజ్యసభలో అడ్డంకులు ఎదురైన సంగతి తెలిసిందే. ఇప్పుడిక రాజ్యసభ కూడా ఆమోదించడంతో చెక్ బౌన్స్ చట్టం మారినట్లయింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ