పాక్ చేసిన దారుణం మీరూ చదవండి

April 20, 2016 | 02:39 PM | 3 Views
ప్రింట్ కామెంట్
kirpal-singh-body-internal-organs-missed-niharonline

శత్రువునైనా కనికరించి వదిలేసి మన దేశ మనస్తత్వం అందరికీ ఉండాలన్న రూల్ ఏం లేదు. పైగా పాకిస్థాన్ లాంటి దేశాలకు ఉంటుందని అస్సలు ఆశించకూడదు. ఎందుకంటే వారు చేసే పైశాచికత్వాలు అలా ఉంటాయి మరి. సరిగ్గా అలాంటి దుర్మార్గపు చర్యపు మరోమారు పాల్పడింది పాక్.  అక్కడి జైల్లో దశాబ్దాలుగా మగ్గుతూ గతవారం అనుమానాస్పద స్థితిలో క్రిపాల్ సింగ్ మరణించిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో మరణించాడని చెబతున్నప్పటికీ, అతన్ని జైలు అధికారులే చంపి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు క్రిపాల్ కుటుంబ సభ్యులు.

తాజాగా అతని మృతదేహం భారత్ కి చేరుకుంది. దాన్ని పరిశీలించిన వైద్యులు షాక్ కి గురయ్యారు. గుండె, కాలేయం తదితర అవయవాలను లేని అతని పార్థివ శరీరంను పాక్ మనకు అప్పగించిందట. పోస్టు మార్టం నిర్వహించాలంటే కీలకమైన అవయవాలు తప్పనిసరి. "దేశం కోసం మా అంకుల్ ప్రాణాలను వదిలారు. సరబ్ జిత్ హత్య కేసులో ఆయనొక్కడే సాక్ష్యం. సరబ్ ఎలా మరణించాడో బయటకు తెలియకుండా చేసేందుకే పాక్ ప్రభుత్వం ఆయన్ను చంపించింది" అని క్రిపాల్ కోడలు అశ్వని ఆరోపించింది. గతంలో సరబ్ జిత్ విషయంలోనూ పాక్ ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ