దొంగలు కదా దంచి కొట్టారు

December 23, 2015 | 04:36 PM | 1 Views
ప్రింట్ కామెంట్
rajona-sandhu-attacked-in-jail-niharonline

కాంట్రవర్సీలను న్యూస్ చేసి క్యాష్ చేసుకోవాలన్న ఓ జర్నలిస్ట్ ఆలోచన ప్రాణాల మీదకు తెచ్చిపెట్టింది. ఓ హత్య కేసులో నిందితుడిని ఇంటర్వ్యూ చేద్దామని వెళ్లి అక్కడి దొంగల చేత చితక్కొట్టించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే...పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న బల్వంత్ సింగ్ రజోనాను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రముఖ పాత్రికేయుడు కన్వార్ సంధు జైలు అధికారుల నుంచి అనుమతి పొందారు. అంతేకాదు బల్వంత్ సింగ్ రజోనాను ఇంటర్వ్యూ చేసేందుకు పాటియాలా జైలుకు వెళ్లారు. ఆ సమయంలో కన్వార్ సంధుపై అక్కడే ఉన్న కొంత మంది ఖైదీలు దాడికి దిగారు. దీంతో సకాలంలో స్పందించిన పోలీసులు, వారిని అడ్డుకున్నారు. దీనిపై పంజాబ్ లో పెను దుమారం రేగుతోంది. జైలులో ఇంటర్వ్యూకి అనుమతి ఇవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఓ అధికారిని సస్పెండ్ చేసింది. దొంగల చేతుల్లో తన్నులు తిన్న ఆ జర్నలిస్ట్ ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ