బాలికను వేధించారు... ఆపై కాల్చి చంపారు

February 23, 2016 | 01:00 PM | 3 Views
ప్రింట్ కామెంట్
UP-Girl-Shot-Dead-eve-teasers-niharonline

చట్టాలు తీరిగ్గా నిద్రపోతున్న వేళ మహిళలు, బాలికలపై వేధింపులకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం చోటుచేసుకుంది. ఆకతాయిల వేధింపులకు ఎదురొడ్డి నిలిచిన ఆ బాలిక కిరాతకుల తుపాకీ తూటాలకు బలైపోయింది. ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది.

సీతాపూర్ కు చెందిన ఓ బాలిక, తనపై వేధింపులకు గురి చేస్తున్న ఆకతాయిలకు ఎదురు తిరిగింది. అంతే, తమకే ఎదురుతిరుగుతావా? అంటూ ఆ బాలికపై ఆ దుర్మార్గులు తుపాకీ ఎక్కుపెట్టారు. క్షణాల్లో తుపాకీ నుంచి దూసుకువచ్చిన బుల్లెట్లు బాలిక శరీరాన్ని చిధ్రం చేశాయి. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే చనిపోయింది. వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, ఈ కారణంగా తన చెల్లి బలైపోయిందని ఆ బాలిక సోదరి వాపోతోంది. బాలిక చనిపోయాక గాని మేల్కొనని పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ