మహా మరణాలు ఇంకెంత కాలం...

September 07, 2015 | 12:51 PM | 4 Views
ప్రింట్ కామెంట్
maharastra-mother-suicide-along-with-five-kids-niharonline.jpg

అన్నం పెట్టే అన్నదాత పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతుంది. కడుపు నిండా ఇంత కూడు పెట్టేవారే కరువై బలవనర్మణాలకు పాల్పడుతున్నాడు. తాను పోతే కుటుంబ పోషణ ఎలా రా దేవుడా అని ఆలోచిస్తూ వారిని కూడా తనతోపాటు తీసుకెళ్తున్నాడు. భారత్ లో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పేందుకు తాజా ఉదాహరణే నిదర్శనం. మహారాష్ట్రలో తీవ్ర కరవు బారినపడ్డ మరాట్వాడ రీజియన్ లోని అంబీ గ్రామంలో తన బిడ్డలకు పట్టడన్నం కూడా పెట్టలేని ఓ తల్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణం చెందింది. మనీషా గట్కల్ అనే ఈ మహిళకు ఐదుగురు పిల్లలు. భర్త లక్షణ్ ఓ రైతు. ఈ యేడు కరువు అక్కడ విలయతాండవం చేసింది. దాంతో చేతిలో పనిలేదు.  పంట లేదు. ఫైనల్ గా ఇంట్లో బియ్యం లేవు. "మాది చాలా పేద కుటుంబం. తినేందుకు తిండి లేదు. చేసేందుకు పని లేదు. చిన్న పని దొరికితే వెళ్లాను. తిరిగి వచ్చే సరికి ఇంటిలోపల తలుపు గడి వేసుకుని పిల్లలతో సహా ఆమె ఆత్మహత్య చేసుకుంది" అని మీనాక్షి భర్త లక్ష్మణ్ విలపిస్తూ తెలిపాడు.

                                  ఆ మరణాలు ఎంత హృదయ విదారకం అంటే... ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు సైతం అక్కడి పేదరికం చూసి కంటతడి పెట్టారట. ఓ అల్యూమినియం ప్లేట్ లో రెండు చపాతీలు మాత్రం అక్కడ కనిపించాయట. ఆహార ధాన్యాలు ఉండే డబ్బాలు ఖాళీగా ఉన్నాయి. బియ్యం, నూనెలు లేవు. అసలు తినదగ్గ పదార్థాలు ఏమీ లేదు. ప్రభుత్వం ఇచ్చే 18 కిలోల గోధుమలు, 12 కిలోల బియ్యం ఏడుగురు సభ్యులున్న కుటుంబానికి కేవలం 12 రోజులు మాత్రమే వస్తాయని, ఇక మిగతా రోజులు ఏం తినాలని స్థానికులు ప్రశ్నించారు. కాగా, మరాట్వాడ రీజియన్ లో గత సంవత్సరం 574 మంది రైతు కుటుంబాల్లో ఆత్మహత్యలు జరుగగా, ఈ సంవత్సరం ఇప్పటివరకూ 628 మంది బలవంతంగా తమ ప్రాణాలు తీసుకున్నారు. కనీసం గ్రామీణోపాధి పథకం కిందైనా పనులు లభిస్తున్నాయా అంటే అది లేదు. మరలాంటి సమయంలో అన్నదాత ఆయువు తీసుకోక ఏం చేస్తాడు. ఫడ్నవీస్ ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలి, లేకపోతే మహా మరణాలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ