నరహంతకుడు ఉరి తాడుకు చేరువవుతున్నాడు

July 15, 2015 | 02:23 PM | 14 Views
ప్రింట్ కామెంట్
yakub_abdul_razak_memon_ready_for_hang_niharonline

దేశ చరిత్రలోనే అత్యంత విషాద ఘట్టాల్లో ఒకటి 1993 ముంయి పేలుళ్లు. ఆ కేసులో సూత్రధారుల్లో ఒకడైన యాకూబ్ మెమన్ (53) ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు, ఆ తర్వాత రాష్ట్రపతి కూడా క్షమాబిక్ష పిటిషన్ ను తిరస్కరించారు. ప్రస్తుతం నాగ్ పూర్ కేంద్ర కారాగారంలో ఈ రాక్షసుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. అప్పుడెప్పుడో ఉరి పడినా.. చట్టంలోని సౌలభ్యాల పుణ్యామా అని ఇప్పటివరకూ ఆ తీర్పు అమలు కాలేదు. తన ఉరిని నిలిపివేయాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటీషన్ వేయటం.. రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు చేయటం లాంటివి చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవటంతో ఈ నరహంతక ఉగ్రవాదిని ఈ నెల 30న ఉరి తీయాలని నిర్ణయించారు. వందల మంది ప్రాణాలు పొట్టనబెట్టుకున్నా.. వేలాది మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపినా ఫర్లేదు.. కానీ.. ఆ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తిని ఉరి తీసే సమయం దగ్గర పడితే చాలు.. మానవ హక్కుల సంఘాల నోర్లు ఒక్కసారి తెరుచుకుంటాయి. ఎంత ఘోరాపరాధం చేసినా పర్లేదు అయినా మనిషి ప్రాణం ఎందుకు తీస్తారంటూ ప్రశ్నిస్తారు. దానికి అడ్డదిడ్డమైన వాదనలు వినిపిస్తారు. ఒక రాక్షసుడి ప్రాణాల కోసం అంతలా తపించి పోయే హక్కుల సంఘాల నేతలకు.. ఆ దుర్మార్గుడి కారణంగా మృతి చెందిన వారివి ప్రాణాలేనని.. సదరు దోషి కారణంగా బాధితులైన వారివి జీవితాలేనని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ