కాంగ్రెస్ విముక్త దేశాన్ని తయారుచేద్దాం

December 23, 2014 | 03:52 PM | 21 Views
ప్రింట్ కామెంట్

వరుసగా జరుగుతున్న రాష్ట్రాల ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తూ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతున్న ప్రజలకు ధన్యవాదాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ప్రజల సహకారంతో కాంగ్రెస్ విముక్త భారతదేశాన్ని తయారు చేస్తామని ఆయన ప్రకటించారు. జార్ఖండ్, జమ్ము ఫలితాల నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు బీజేపీ, మోదీ నాయకత్వం పట్ల అంతులేని విశ్వాసం ప్రదర్శించారన్నారు. ముఖ్యంగా జార్ఖండ్ లో కాంగ్రెస్, జేఎంఎం, జేడీ పార్టీ ప్రముఖ నేతలను ఓడించటం ద్వారా ప్రజలకు తమకేం కావాలో స్పష్టంగా చెప్పారన్నారు. అలాగే జమ్ములో కూడా ప్రజలు బీజేపీని విశేషంగా ఆదరించారని తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ