స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిపై కేసు

October 20, 2015 | 11:12 AM | 4 Views
ప్రింట్ కామెంట్
Muthulakshmi-veerappan-wife-niharonline

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను వణికించిన స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏనుగు దంతాలను, ఎర్రచందనపు దుంగలను యధేచ్ఛగా స్మగ్లింగ్ చేసిన వీరప్పన్ 2004లో ఎస్టీఎఫ్ బలగాల చేతిలో హతమయ్యాడు. వీరప్పన్ మృతదేహాన్ని సేలం జిల్లాలోని కలత్తూరు సమీపంలోని మూలకాడులో ఖననం చేశారు. గత ఆదివారం నాడు వీరప్పన్ 11వ సంస్మరణ దినం సందర్భంగా మూలక్కాడు, మేచ్చేరిలో అనేక చోట్ల వీరప్పన్ పోస్టర్లు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండానే బ్యానర్లు ఏర్పాటు చేశారనే ఆరోపణలతో ముత్తులక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ