మళ్లీ ఒక్క రూపాయి నోట్లు

December 27, 2014 | 01:17 PM | 41 Views
ప్రింట్ కామెంట్

త్వరలో ఒక్క రూపాయి నోట్లు తిరిగి దర్శనమివ్వనున్నాయి. సుమారు రెండు దశాబ్దాల క్రితం ఆపివేసిన ఒక రూపాయి నోట్ల ముద్రణను కొత్త సంవత్సరం నుంచి తిరిగి ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశ్చర్యకర రీతిలో నిర్ణయం తీసుకుంది. ఈ దఫా ముద్రించే నోట్లపై ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. కానీ, ఈ ఒక రూపాయి నోట్లను కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెలామణి చేయనుంది. దీంతో, దీనిపై ఆర్థికశాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. ఈ నోట్లపై రూపాయి గుర్తు ఉంటుందని, పాత నోట్లపై ఉన్నట్లుగానే సాగర్ సామ్రాట్(సముద్రంలోని ఓ చమురు క్షేత్రం ) చిత్రం, 15 భారత భాషల్లో నోటు విలువ తదితరాలు ఉంటాయని తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ