తాళిని గేలి చేసిందని మూత్రం తాగించారు

June 09, 2015 | 05:53 PM | 1 Views
ప్రింట్ కామెంట్
couple_tortured_forced_to_drink_urine_in_UP_niharonline

వివాహ బంధాన్ని అపహాస్యం చేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఓ మహిళను, ఆమె ప్రియుడిని చిత్ర హింసలు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. హోషంగాబాద్ జిల్లా సింగోడా గ్రామానికి చెందిన అక్షయ్ మెహ్రా అనే యువకుడు, మైదఖేడా గ్రామానికి చెందిన ఓ వివాహిత ప్రేమించుకున్నారు. ఆ విషయం తెలిసిన ఆమె భర్త ఇంట్లో బంధించి, చిత్ర హింసలు పెట్టసాగాడు. ఎలాగోలా భర్త చెర నుంచి తప్పించుకున్న ఆమె పుట్టింటికి చేరి, ప్రియుడిని వివాహం చేసుకుంది. ఇక విషయం తెలుసుకున్న మైదఖేడా గ్రామస్థులు ఆమె చిత్రహింసలకు గురిచేశారు. ఇద్దరినీ ఇనుప చువ్వలతో విపరీతంగా కొట్టిన గ్రామస్థులు, వారి మెడలో చెప్పుల దండలు వేశారు. అనంతంర వారిద్దరిచేత మూత్రం తాగించారు. అనంతరం వారిద్దరినీ పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు ఫిర్యాదు నమోదుచేసి నలుగురు గ్రామస్థులను అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ