ధోనీ ఓ అబద్ధాల కోరు

November 19, 2014 | 11:43 AM | 44 Views
ప్రింట్ కామెంట్

భారత క్రికెట్ టీం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పెద్ద తమ విచారణలో అన్ని అబద్ధాలే చెప్పాడని ముద్గల్ కమిటీ నివేదికలో పేర్కోనడం యావత్ దేశాన్ని షాక్ కి గురిచేసింది. ఐపీఎల్ బెట్టింగ్ కేసు విచారణ జరుగుతున్న సమయంలో గురునాథ్ మరియప్పన్ కు చెన్నై సూపర్ కింగ్స్ టీంతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం అతడు జట్టును అభిమానించే వ్యక్తి అని ఆ జట్టు కెప్టెన్ ధోనీ విచారణలో కమిటీకి తెలిపాడు. చెన్నై జట్టు సహా యజమాని అయిన ఇండియా సిమెంట్ కూడా ధోనీ చెప్పిన విషయాన్నే సమర్థించింది. అయితే జస్టిస్ ముద్గల్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో మరియప్పన్ చెన్నై టీంకు కీలక వ్యక్తి అని, ఈ విషయాన్ని పక్కదోవ పట్టించే విధంగా ధోనీ అబద్ధాలు చెప్పాడని తెలిపింది. దీంతో యావత్ క్రికెట్ ప్రపంచం విస్మయానికి గురైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన కోసం బీజీగా ఉన్న ధోనీ ఇక ఈ విషయంపై ఎలా స్పందిస్తాడో వేచిచూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ