వాట్సప్ తోపాటు వాటిని మినహాయించారు

September 22, 2015 | 11:46 AM | 2 Views
ప్రింట్ కామెంట్
India-exempts-social-media-from-encryption-policy

ఆఘ మేఘాల మీద జారీ చేసిన జీవోకి కేంద్రం లెంపలేసుకుంది. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శల రావటంతో మోదీ సర్కారు ఓమెట్టు దిగింది. ప్రతిపాదిత ఎన్ క్రిప్టెడ్ చట్టం పరిధి నుంచి వాట్స్ యాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలకు మినహాయింపు ఇస్తున్నట్టు వెల్లడించింది.

మొబైల్ మాధ్యమంగా జరిగే సమాచార బట్వాడాకు సంబంధించిన అన్ని టెక్ట్స్ మెసేజ్ లను 90 రోజుల పాటు కచ్ఛితంగా నిల్వ ఉంచుకోవాలని ఆదేశించింది. నిఘా వర్గాలు, విచారణ సంఘాలు అడిగితే, వాటిని అందివ్వాలని అలా కానీ పక్షంలో  క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సోమవారం కేంద్రం ముసాయిదా ప్రతిపాదనలు తయారు చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా  తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రైవేటు మెసేజ్ లపై కేంద్రం పెత్తనం ఏంటని ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీంతో జాతీయ ఎన్ క్రిప్షన్ విధానాన్ని సవరిస్తూ, ఆఘమేఘాల మీద క్లారిఫికేషన్ ను ఈ ఉదయం ఆన్ లైన్లో కేంద్ర ప్రభుత్వం పోస్ట్ చేసింది.

               నెటిజన్లపై పెత్తనం చేయడం తమ ఉద్దేశం కాదని, జాతీయ భద్రతాంశాలు ముడిపడివున్న చోట మరింత నిఘా కోసమే ఈ ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపింది. సామాజిక మాధ్యమాలకు ఈ నూతన విధానం వర్తించదని స్పష్టం చేసింది.  దీంతో వాట్సప్ తోపాటు ఫేస్ బుక్, ట్విట్టర్ లకు ఈ నిబంధనలు వర్తించనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ