మున్నాభాయ్ ఇక అనుభవించాల్సిందే

September 24, 2015 | 01:12 PM | 2 Views
ప్రింట్ కామెంట్
governor-vidya-sagar-reject-petition-sanjay-dutt-niharonline

ముంబై పేలుళ్ల కేసులో భాగంగా అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న నేరంలో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ కి మరో పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయన పెరోల్ పై పలుమార్లు బయటికి వచ్చిన సంగతి తెలసిందే. ఆయన శిక్ష కాలం ఫిబ్రవరి 2016 తో పూర్తి కానుంది. అయితే ముందస్తు విడుదల కోసం ఆయన గవర్నర్ కి ఓ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇక దత్ పెట్టుకున్న ఈ పిటిషన్ ను మహా రాష్ట్ర గవర్నర్  విద్యాసాగర్ తిరస్కరించారు.

సంజయ్ దత్ తనకు విధించబడ్డ శిక్షను పూర్తిగా అనుభవించాల్సిందేనని, పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు విద్యాసాగర్ తెలిపారట. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలు ఓ ప్రకటన వెలువరించాయి. తనను క్షమించాలని సంజయ్ పెట్టుకున్న దరఖాస్తును గవర్నర్ తిరస్కరించినట్టు అధికారులు వివరించారు. కాగా, ఈ కేసులో అక్రమ ఆయుధాలను ఉద్దేశపూర్వకంగా కలిగివున్నాడన్న ఆరోపణలు రుజువైన నేపథ్యంలో సంజయ్ కి జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఆయన పెరోల్ పై బయటకు రాగా, మహా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ