చచ్చిన శవం లేచి కూర్చుంటే...

October 12, 2015 | 05:46 PM | 4 Views
ప్రింట్ కామెంట్
dead-body-shivered-the-doctor-at-mumbai-niharonline

చచ్చిన మనుషులు లేచి కూర్చోవటం తరచూ మనం వార్తల్లో వింటూనే ఉంటాం. కానీ, అధికారికంగా చచ్చిపోయాడని వైద్యులు ప్రకటించిన మనిషి పోస్ట్ మార్టం చేస్తుండగా లేచి కూర్చుంటే డాక్టర్లకు సైతం గుండాగిపొద్ది. సాధారణంగా పోస్టు మార్టం చేసే వైద్యులు చాలా ధైర్యంగా ఉంటారు. కానీ, అలాంటి వైద్యులను బెంబేలెత్తించాడో వ్యక్తి. ముంబైలోని సులోచనశెట్టి మార్గ్ లో ఉన్న బస్టాప్ వద్ద ఓ వ్యక్తి (42) అపస్మారకస్థితిలో పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతనిని పరిశీలించిన పోలీసులు, చికిత్స నిమిత్తం లోకమాన్య తిలక్ ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన ఆ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ రోహన్ రోహేకర్ అతను మృతి చెందాడని నిర్ధారించారు. రికార్డుల్లో కూడా అతను మృత్యువాతపడినట్టు చేర్చారు.

దీంతో పోస్టు మార్టం నిమిత్తం అతనిని మార్చురీకి తరలించారు. కాసేపట్లో పోస్ట్ మార్టంకు వైద్యులు సిద్ధమవుతుండగా, టేబిల్ పై ఉన్న అతను లేచి కూర్చున్నాడు. దీంతో వైద్యులు బెంబేలెత్తిపోయారు. తీరా చూస్తే అతను మరణించలేదని నిర్ధారణ అయింది. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యాన్ని అంతా ఎండగడుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ