పద్మభూషణ్ కోసం పోటీలు

January 06, 2015 | 02:55 PM | 48 Views
ప్రింట్ కామెంట్

పద్మభూషణ్ పురస్కారానికి అథ్లెట్లు పోటీలు పడుతున్నారు. పద్మభూషణ్ అవార్డుకు సిఫారసు చేయలేదంటూ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బహిరంగంగా డిమాండ్ చేయడం మరో క్రీడాకారుడికి అవకాశం ఇచ్చినట్టయ్యింది. కొత్తగా తన పేరును కూడా పద్మభూషణ్ పురస్కారానికి సిఫారసు చేయాలని బాక్సర్ విజేందర్ సింగ్ అడుగుతున్నాడు. ‘పద్మభూషణ్ అవార్డు కోసం నా పేరు కూడా కేంద్ర క్రీడాశాఖకు సిఫారసు చేయాలని బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిని కోరాను’’ అని విజేందర్ తెలిపారు. మరి దీనిపై కేంద్ర క్రీడా శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి. 2008 ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన విజేందర్ ను 2010లో పద్మశ్రీ అవార్డుతో కేంద్రం సన్మానించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ