భర్తను చంపాలనుకుంటే కూతురు బలైంది

January 20, 2016 | 12:32 PM | 3 Views
ప్రింట్ కామెంట్
poison-tea-kills-daughter-instead-husband-tripura-niharonline

భర్త పీడను ఎలాగైనా విదిలించుకోవాలనుకున్న ఆ మహిళకు పెద్ద షాకే తగిలింది. భర్త బదులు కుమార్తెను కోల్పోయిన దుర్ఘటన త్రిపురలో చోటుచేసుకుంది. త్రిపురలోని అగర్తలాలో గోవింద సర్దార్‌పారాకు చెందిన సీతారాణి అనే మహిళ రెండో భర్త గౌతమ్ ను చంపాలని భావించింది. దీంతో 'టీ'లో విషం కలిపి అతనికి ఇచ్చింది. అయితే అతగాడు మాత్రం దానిని తాగకుండా ఆయన అలాగే టేబుల్ పై పెట్టేశాడు. ఇంతలో సీత పిల్లలు శ్రియ (4), మెర్రీ (12) లు ఆడుకుంటూ అటువైపుగా వచ్చారు. ఆ'టీ'ని తాగేశారు. దీంతో శ్రియ అక్కడికక్కడే మృతి చెందగా, మెర్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో సీతపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ