రియాల్టీ షో కోసం ప్రాణం తీసిన యువజంట

September 25, 2015 | 05:13 PM | 4 Views
ప్రింట్ కామెంట్
boy-killed-by-teenage-in-delhi-for-reality-show-niharonline

రియాల్టీ షో లో పాల్గొనాలన్న వారి సరదా ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఢిల్లీకి చెందిన 17 ఏళ్ల్ ఓ అబ్బాయ్, అమ్మాయి ముంబయ్ వెళ్లి ఓ పాపులర్ రియాలిటీ షోలో పాల్గొనాలని కలలు కన్నారు. అయితే దానికి అవసరమైన డబ్బు వారి దగ్గర లేదు. దీంతో ఓ పథకం రచించి ఘాతుకానికి పాల్పడ్డారు.

                  ఢిల్లీ పోలీస్ అధికారి రాంధ్వా కథనం ప్రకారం..తమ డ్యాన్స్ ట్రూపుకే చెందిన 13 సంవత్సరాల బాలుడు స్వప్నేష్ గుప్తాకు ఆ యువజంట మాయమాటలు చెప్పి వారితోపాటు కిడ్నాప్ చేశారు.  ఆ కుర్రాడిని ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ తీసుకెళ్లి  అక్కడ స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నారు. మర్నాడు అక్కడికి సమీపంలో ఉన్న రాణిఖేత్ కొండపైకి ఆ బాలుడిని తీసుకెళ్లారు. తర్వాత బాలుడి మెడకు బెల్టు బిగించి ఊపిరాడకుండా చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం బాలుడి మృతదేహాన్ని కొండపై నుంచి కిందకు తోసేశారు.

కొద్ది రోజుల తర్వాత వాళ్లిద్దరూ ఢిల్లీకి తిరిగి వచ్చారు. ‘మీ కుమారుడు మీకు దక్కాలంటే మాకు రూ.60 వేలు ఇవ్వాలి’ అంటూ స్వప్నేష్ తండ్రికి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ కు దిగారు నిందితులు. దీంతో స్వప్నేష్ తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తానికి రియాల్టి సరదా ఓ బాలుడి ప్రాణాన్ని బలితీసుకుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ