పాక్ బార్డర్ వద్ద టెంట్ లో మోదీ

December 08, 2015 | 02:44 PM | 1 Views
ప్రింట్ కామెంట్
A makeshift tent for the PM modi at Rann of Kutch

భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో సాహస చర్యకు పూనుకోనున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టాక  దీపావళి సంబరాలను ఆయన భారత సైనికులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. మొదటిది కశ్మీర్ కు వెళ్లి మరీ ఆయన సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక రెండో దీపావళిని కూడా పంజాబ్ లోని అమృత్ సర్ కు వెళ్లి అక్కడి జవాన్లతో జరుపుకున్నారు. ఈ రెండు సందర్భాల్లో కూడా ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో ఆయన ధైర్యంగా సంచరించారు. ఇక ఇప్పుడు మరో డేరింగ్ అండ్ డాషింగ్ పనికి సిద్ధమయ్యారు.

త్వరలో అన్ని రాష్ట్రాల డీజీపీ సమావేశాలను నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది. ఇందుకోసం పాకిస్థాన్ సరిహద్దు వద్ద నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని ఆదేశించారట. ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు చివరిదాకా మోదీ అక్కడే ఉంటారట. పాక్ సరిహద్దును ఆనుకుని తన సొంత రాష్ట్రం గుజరాత్ లోని రాణా ఆఫ్ కచ్ వద్ద జరగనున్న ఈ సమావేశాల్లో మోదీ ఎక్కడ బస చేస్తారో తెలుసా?. సైన్యం ఏర్పాటు చేసే టెంట్లలో . దీంతో రాణా ఆఫ్ కచ్ ను ఆ మూడు రోజుల పాటు ‘నో ఫ్లయింగ్ జోన్’గా సైన్యం ప్రకటించనుంది. అలాగే డ్రోన్ ల సంచారాన్ని కూడా నిషేధించనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ