గీతపై మోదీ అప్యాయత ఎలా చూపారంటే...

October 27, 2015 | 11:18 AM | 1 Views
ప్రింట్ కామెంట్
PM-narendra-modi-geetha-niharonline

భజీరంగీ భాయ్ సినిమా తర్వాత వెలుగులోకి వచ్చిన గీత కథ మనందరికీ తెలుసు. దారి తప్పి పాకిస్థాన్ చేరుకొని, అక్కడ 15 ఏళ్ల పాటు గడిపిన గీత తిరిగి భారత్ కు చేరుకుంది. దేశంకాని దేశంలో ఉన్నప్పటికీ ఆమె ఆహారపుటలవాట్లు కానీ, జీవన విధానం కానీ మారలేదు. దీనికి కారణం దేవుడు ఆమెను మూగ, బధిర బాలికగా పుట్టించడమే. ఆప్యాయత చూపితే అల్లుకుపోవడం, స్వచ్ఛంగా ఉండడం గీత నైజం. బాధకలిగితే పెద్దగా ఏడ్వడం ఆమెకు అలవాటు. అలాంటి గీత దశాబ్ధంన్నర తర్వాత తిరిగి తల్లిదండ్రులను కలుసుకునేందుకు స్వదేశం చేరుకుంది. పనిలో పనిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఆమె కలిసింది. ఇక ఆమెలోని స్వచ్ఛతకు ప్రధాని నరేంద్ర మోదీ కదిలిపోయారు.

సాధారణంగా తనను కలిసిన వారిని ప్రోటోకాల్ సైతం పక్కన పెట్టి మోదీ వ్యవహారిస్తుంటారు. అప్యాయంగా వారితో మాట్లాడటం, భేటీ తరువాత తనను కలిసిన వారితో సెల్ఫీలు తీసుకోవడం ప్రధానికి కామన్. అయితే గీత వ్యవహారంలో మరింత ప్రేమను చూపారు ప్రధాని. చాలా కాలం తర్వాత ఇండియాకు తిరిగి రావటం, కన్నవారు ఎవరో తెలీయక బాధపడుతున్న ఆమెపై మోదీ అనురాగం చూపారు.

మోదీని కలుసుకున్నప్పుడు ఆయనకు ఆమె నమస్కరించింది. ప్రతిగా ఆయన ఆమెకు దీవెనలు అందించారు. 15 ఏళ్ల పాటు ఆమెను తమ బిడ్డలా పెంచిన 'ఈది ఫౌండేషన్' సభ్యులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం చివర్లో చిన్నారి తన తండ్రిని అల్లుకుపోయినట్టు మోదీ చేతికి గీత అల్లుకుపోయింది. ఆ క్షణంలో స్వచ్ఛమైన గీతను చూసిన మోదీ మనస్పూర్తిగా నవ్వారు. భారత ప్రభుత్వం తరపున ఈది ఫౌండేషన్ కు కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వారు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ