రాజుగారిని పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని

October 26, 2015 | 11:56 AM | 6 Views
ప్రింట్ కామెంట్
PM-modi-praised-civill-aviation-minister-ashoka-gajapathi-raju-niharonline

సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఓ తెలుగు మంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. అలనాటి అశోక చక్రవర్తిలాగే వినూత్న రీతిలో అభివృద్ధిలో దూసుకుపోతున్నారని, తత్ఫలితంగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడపడమే కాక ఇతర రాజకీయ నేతలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఇంతకీ ఆయన పొగిడింది ఎవరినంటారా?  విజయనగర రాజ వంశస్థుడు, టీడీపీ సీనియర్ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజుని.

                             సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద తన సొంత నియోజకవర్గంలోని ద్వారపూడి గ్రామాన్ని దత్తత తీసుకున్న అశోక గజపతిరాజు, గ్రామంలో అక్షరాస్యత పెంపునకు వినూత్న చర్యలు చేపట్టారు. గ్రామంలోని పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు సాయంత్రం పూట అదే పాఠశాలలో తమ తల్లిదండ్రులతో అక్షరాలు దిద్డిస్తున్నారు. ఫలితంగా గ్రామంలో ఒక్క పైసా నిధులు ఖర్చు కాకుండానే అక్షరాస్యత మెరుగుపడింది. ఈ విషయంపై సమగ్ర వివరాలు అందుకున్న ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. నయా పైసా ఖర్చు లేకుండా, ప్రణాళిక అసలే లేకుండానే అశోక గజపతిరాజు తన దత్తత గ్రామంలో అక్షరాస్యతను పెంపొందించారని కీర్తించారు. అశోక గజపతిరాజు తీసుకున్న చర్యలు ఇతరులకు ఆదర్శవంతంగా ఉన్నాయని కీర్తించారు. పెయిడ్ న్యూస్ లు ఇచ్చుకుని సంతోషించే నేతలు ఉన్న ఈరోజుల్లో తాను చేస్తున్న పని గుట్టుగా చేసుకుపోతున్న రాజుగారికి ఈ ప్రశంస చాలా విలువైందే కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ