చైనా ట్విట్టర్ లో నరేంద్ర మోదీ

May 04, 2015 | 04:07 PM | 36 Views
ప్రింట్ కామెంట్
modi_china_weibo_niharonline

చైనా పర్యటన నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రజలకు చేరువ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు చైనీయుల ట్విట్టర్ వర్షన్ వైబో లో అకౌంట్ ఓపెన్ చేశారు. ‘‘హాలో చైనా! వైబో ద్వారా చైనాలోని మిత్రులకు దగ్గర కావాలనుకుంటున్నాను అని వైబోలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశాడు. కాగా, ప్రస్తుతం ఆయన ఖాతాను ఫాలో కావాలని రిక్వెస్ట్ లు పెడుతున్న చైనీయుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. చైనాకు, భారత్ కు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది ఈ పర్యటన ద్వారా అయినా ఇరుదేశాల మధ్య మైత్రి సంబంధాలు మెరుగు పడేందుకు మోదీ చేయని ప్రయత్నాలు లేవనిపిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ