భారత్ లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది

November 21, 2015 | 12:14 PM | 1 Views
ప్రింట్ కామెంట్
indian_PM_modi_addresses_ASEAN_summit

భారత్ అడుగులు పారదర్శకత దిశగా పడుతున్నాయని... ఈ విషయాన్ని ప్రపంచ దేశాలన్నీ ఓసారి భారత్ వస్తే గమనించవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ లో మార్పు స్పష్టంగా కనబడుతోందని చెప్పారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన మోదీ ఈ విషయాన్ని తెలిపారు.

భారత్ కు తూర్పు దేశాలు సహజ భాగస్వాములని చెప్పారు. ఆసియా దేశాలు బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలని, 21వ శతాబ్దం భారత్ దే అని మోదీ అన్నారు. ఆసియా దేశాల అభివృద్ధిని చూసే ఈ మాట చెబుతున్నానని తెలిపారు. భారత్ లో అందరికీ ఇళ్లు అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని, పట్టణ ప్రాంతాల్లో 2 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 2.95 కోట్ల ఇళ్లను నిర్మించాలనేదే తమ లక్ష్యమని మోదీ తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ