కోహినూర్ పై పార్లమెంట్ లో క్లారిటీ?

April 20, 2016 | 03:02 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modi-kohinoor-parliament-debate-niharonline

బ్రిటీష్ పాలనలో ఇండియా నుంచి తరలివెళ్లిపోయిన అత్యంత విలువైన కోహినూర్ వజ్రం తిరిగి ఇండియాకు వస్తుందా అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దానిని తిరిగి ఎలా తెప్పించాలన్న విషయమై నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు పార్లమెంటులో చర్చించనుంది. కోహినూర్ విషయంలో కోర్టులో ఓ మాట చెప్పి, ఆపై 24 గంటలు తిరక్కముందే మరో మాట చెప్పి, విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేంద్రం, నష్ట నివారణ దిశగా, ఈ అంశాన్ని పార్లమెంట్ ముందే ఉంచాలని నిర్ణయించింది. ఈ వజ్రాన్ని బ్రిటన్ బలవంతంగా తీసుకెళ్లలేదని, వారికి బహుమతిగా పంజాబ్ పాలకులు ఇచ్చారని, అందువల్ల తిరిగి ఇవ్వాలని కోరలేమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలుపగా, దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఆపై, సామరస్య పూర్వకంగా వజ్రాన్ని తిరిగి ఇండియాకు తీసుకురావాలన్నదే తమ అభిమతమంటూ కేంద్ర సాంస్కృతిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ గందరగోళాల నడుమ పార్లమెంట్ లో జరిగే చర్చపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ