మరోసారి మోదీ-షరీఫ్ భేటీ?

February 19, 2016 | 02:57 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Modi-Sharif-likely-to-meet-Washington-niharonline

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీలు మరోసారి భేటీ కానున్నారా?. అవుననే వార్తలు వినవస్తున్నాయి. వచ్చే నెల చివర్లో వాషింగ్టన్ లో ప్రపంచ అణుసదస్సు జరగనుంది. మార్చి 31, ఏప్రిల్ 1న జరగనున్న ఆ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వం వహిస్తారు. ఇటువంటి సదస్సుకు మొదటిసారి ఇద్దరు ప్రధానులు హాజరువుతుండగా, ఆ సమయంలోనే మోదీ, షరీఫ్ ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలిసింది. ఇప్పటికే ఈ భేటీకి పాక్ అధికారులు సమాయత్తమవుతుండగా, ఇటు మోదీ పర్యటనపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. పఠాన్ కోట్ దాడి నేపథ్యంలో వీరి భేటీ మరెన్ని దాడులకు ఆజ్యం పోస్తుందోనని ప్రతిపక్షాలు కంగారు వ్యక్తం చేస్తున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ