కష్టకాలంలో ఫ్రాన్స్ కి అండగా ఉంటాం

November 14, 2015 | 11:59 AM | 1 Views
ప్రింట్ కామెంట్
modi-condemns-paris-terror-attack-niharonline

పారిస్ లో ఉగ్రవాదులు జరిపిన నరమేధంపై  ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ వేగంగా స్పందించారు. ఈమేరకు ఉదయం ఆయన తన ట్విట్టర్ లో పారిస్ త్వరగా కొలుకోవాలని ట్వీట్ చేశారు. ఉగ్రవాదుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అంతేకాక కష్టకాలంలో ఉన్న ఫ్రాన్స్ కు అండగా ఉంటామని కూడా ఆయన ప్రకటించారు.

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడితో ఆ దేశం చిగురుటాకులా వణికిపోయింది. ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియం వద్ద అసలేం జరుగుతోందో తెలియని క్రీడాభిమానులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ కాగా, దాడిలో ఇప్పటిదాకా 178 మంది చనిపోయినట్లు సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ