మోదీ పర్యటనల వెనుక మర్మం ఇదేనట

March 28, 2015 | 01:37 PM | 62 Views
ప్రింట్ కామెంట్
Narendra_Modi_foriegn_tour_niharonline

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన వరుస విదేశీ పర్యటనలపై పెదవి విప్పారు. తన విదేశీ పర్యటనలతో భారత్ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. విదేశీ పర్యటనపై ఆయన ట్వీట్ చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్యకు కొంత పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. 9 నుంచి 16 వరకు ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల్లో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 9 ఫ్రాన్స్ కు, 12 జర్మనీకి, 14 కెనడాలో పర్యటించనున్నారు. పారిస్ వెలుపల హైటెక్ పారిశ్రామిక యూనిట్లు పరిశీలించనున్నారు. భారత్, జర్మనీ సంయుక్తంగా చేపట్టనున్న హన్నోవర్ మెస్సే ప్రాజెక్టును జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. కెనడాలో రాజకీయవేత్తలు, ప్రవాస భారతీయులు, పారిశ్రామిక వేత్తలను కలవనున్నారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ