ప్రతిపక్షాలకు మింగుడు పడని విషయం ఏంటంటే...

April 07, 2016 | 05:15 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modi-still-popular-in-middle-class-niharonline

రోజురోజుకి దేశ ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా తగ్గిపోతుందంటూ విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు మింగుడుపడని విషయం ఒకటి వెలుగు చూసింది. దేశ వ్యాప్తంగా ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల దృష్టిలో నేటికీ ఆయనపై నమ్మకం సడలలేదని అంటున్నాయి తాజా సర్వేలు. ఏడు ప్రధాన నగరాల్లో జరిపిన సర్వేలలో మోదీనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు ఈటీ-టీఎన్ఎస్ సర్వేలో  వెల్లడైంది.

                      బయటి నుంచి మద్ధుతు అవసరం లేకుండా స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ మోదీకి మద్దతు ఏ మాత్రం తగ్గలేదని ఈటీ-టీఎన్ఎస్ సర్వే లెక్కలు నిరూపిస్తున్నాయి. అయితే కీలక అంశాల సంస్కరణలో వైఫల్యం చెందడంతోపాటు, అనేక వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యం ఆయన ప్రభుత్వంకి మచ్చగా మారాయంట. కానీ, మోదీ ప్రభుత్వం రేటింగ్స్ లో ఫస్ట్ మార్కును మాత్రం కోల్పోలేదని తాజా సర్వేలు తేల్చి చెప్పాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ