పరస్పర విమర్శలు మాని, పరిష్కారం వెతుకుదాం

April 23, 2015 | 03:13 PM | 58 Views
ప్రింట్ కామెంట్
modi_speech_in_parliament_about_farmer_suicide_niharonline

భారత దేశాన్ని తీవ్రంగా కలవరపెడుతున్న అంశాల్లో రైతు ఆత్మహత్యలు ఒకటని ప్రధాని మోదీ అన్నారు. బుధవారం ఆప్ ర్యాలీ సందర్భంగా ఓ రైతు అందరూ చూస్తుండగానే చెట్టుకు ఊరేసుకుని చనిపోవటం పై పార్లమెంట్ ను అట్టుడికించింది. అనంతరం ఈ అంశమై చర్చ జరుగగా ప్రధాని మాట్లాడారు. ఈ విషయంలో రాజకీయం చేస్తూ, విమర్శించుకోవటం మానేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. విపక్షాలు ప్రభుత్వాన్ని, ప్రభుత్వం గడచిన పాలనను గుర్తు చేస్తూ విపక్షాలను నిందించకుండా ఈ సమస్యలకు పరిష్కారాన్ని వెతుకుదామని ఆయన పిలుపునిచ్చారు. రైతుల్లో భరోసా కలిగించేందుకు తాము చేపడుతున్న చర్యలకు మద్దతివ్వాలని కాంగ్రెస్ తదితర విపక్షాలకు ఆయన సూచించారు. ఒకరినొకరు విమర్శించుకుంటూ కూర్చుంటే ప్రజల్లో చులకన అవుతామని ఆయన అన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ