మోదీతో భేటీయా? భయపడిపోతున్న కేంద్ర సచివులు

March 31, 2015 | 01:21 PM | 73 Views
ప్రింట్ కామెంట్
modi_feedback_from_ministers_niharonline

కేంద్ర కేబినెట్ విస్తరణ వార్తలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో పనితీరు సరిగా లేని మంత్రుల పదవులు ఊడటం ఖాయమన్న వార్తలు జోరందుకున్నాయి. సరిగ్గా అదే సమయంలో కేంద్ర కేబినెట్ లోని స్వతంత్ర హోదా, సహాయ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతారన్న వార్తలు ఒక్కసారిగా వేడిని రాజేశాయి. భేటీలో భాగంగా మంత్రుల పనితీరుపై మోదీ ప్రస్తావన చేయటంతోపాటు స్వీయ నివేదికలు కోరతారని కూడా ప్రచారం సాగుతోంది. మంత్రులిచ్చే స్వీయ నివేదికలను, తాను తయారుచేసిన నివేదికలతో సరిపోల్చి మోదీ ఉద్వాసన నిర్ణయం తీసుకుంటారన్న ఊహాగానాలతో కేంద్ర మంత్రులు హడలిపోతున్నారు. మోదీతో భేటీకి గైర్హాజరు కాలేక, తమ పనితీరుపై నివేదికలు ఇవ్వలేక మంత్రులు తీవ్ర అంతర్మథనంలో పడ్డారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ