బిడ్డా... దేశం గురించి ఆలోచించు!

February 27, 2016 | 05:04 PM | 2 Views
ప్రింట్ కామెంట్
modi_mother_health_message_to_her_son_niharonline

దేశ ప్రధాని నరేంద్ర మోదీ తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పారు. మూడు రోజుల క్రితం తనకు కొంత నలతగా ఉందని చెప్పడంతో ఆమెను గుజరాత్ లోని గాంధీనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.

ఇక మోదీ తల్లి ఆరోగ్యం ఏవిధంగా ఉందనే విషయమై మీడియా ప్రధానిని శనివారం ప్రశ్నించగా ఇందుకు ఆయన స్పందిస్తూ తన తల్లి ఆయనతో చెప్పిన మాటలను ప్రస్తావించారు. ‘బిడ్డా.. నా ఆరోగ్యం గురించి నువ్వు బెంగపడవద్దు. దేశం కోసం ఆలోచించు. నీ లక్ష్య సాధనపై ఏకాగ్రత నిల్పు’ అని తన తల్లి తనతో చెప్పిందని మోదీ పేర్కొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ