హర్యానా హింసాకాండపై ప్రత్యేక భేటీ

February 20, 2016 | 03:57 PM | 2 Views
ప్రింట్ కామెంట్
modi_on_haryana_jat_chaos_niharonline

హర్యానాలో జాట్ల హింసాకాండతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి కాస్త అదుపులోకి రావటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న విషయమై మోదీ సర్కారు ఆలోచనలు చేస్తుంది. నిరసన ప్రధర్శలు హింసాత్మకంగా మారి పెచ్చుమీరడం, సామాన్య జనజీవనం అస్తవ్యస్తం కావడంతో రంగంలోకి దిగిన కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ లు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఉద్యమాలు శాంతియుతంగా జరుపుకోవాలని కోరిన వీరు, జాట్ పెద్దలు తక్షణం నిరసనలకు స్వస్తి పలికి ప్రభుత్వంతో చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. తద్వారా వారితో సమావేశం అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మోదీ ప్రకటించారు.

                 సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కేంద్రం కట్టుబడి వుందని, జాట్ల రిజర్వేషన్ల అంశం సున్నితమైనది కావడంతో ఆచి తూచి వ్యవహరించాల్సి వుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి రక్షణ శాఖ అధికారులు, పోలీస్ బాస్ లు కూడా హాజరై పరిస్థితిని సమీక్షించారు. శాంతియుతంగా జరిగితే పర్వాలేదుగానీ, అల్లర్లకు పాల్పడి విధ్వంసాలకు దిగే వారిని ఉపేక్షించవద్దని రాజ్ నాథ్ పోలీసులకు సూచించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిని తక్షణం అరెస్ట్ చేయాలని ఆదేశించారు. హింసాత్మక ఘటనలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మోదీ మంత్రుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ