సవాళ్లను అవకాశాలుగా మార్చుకోండి

February 29, 2016 | 12:32 PM | 3 Views
ప్రింట్ కామెంట్
PM Modi speech at Bareilly farmers rally Niharonline

దేశంలోని రాష్ట్రాలన్నీ వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో నిర్వహించిన కిసాన్ కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. బుందేల్ ఖండ్ లో ఐదు నదులు ప్రవహిస్తున్నప్పటికీ అక్కడి ప్రజలు తాగునీటికి కటకటలాడడం దురదృష్టకరమని అన్నారు. యూపీ సహా ఇతర రాష్ట్రాలన్నీ వ్యవసాయానికి తగిన ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు. దేశ ప్రగతికి రైతన్నలే కీలకమని వ్యాఖ్యానించారు.

                              వ్యవసాయ రంగంలో ఉపాధిహామీ పధకం అమలు చేయాలని అన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం ఇప్పటికి రెట్టింపయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు. రైతుల ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వాటిని అవకాశాలుగా చేసుకోవాలని ఆయన వారికి హితవు పలికారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ